Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18మంది మృతి
కాట్మాండ్ : నేపాల్లోని నువాకోట్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ ట్రక్కు అదుపుతప్పి కొండ మీద నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నువాకోట్లోని కిమ్తాంగ్ నుంచి సిసిఫు వెళ్తున్న ఓ ట్రక్కు సముంద్రతర్ వద్ద అదుపుతప్పి కొండపై నుంచి నదిలో పడింది. ఘటన సమయంలో ట్రక్కులో 40 నుంచి 45 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. సమాచారమందుకున్న పోలీసులు, భద్రతాసిబ్బంది, నేపాల్ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలున్నారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాట్మాండ్ హాస్పిటల్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా తమ బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు పరిమితి కంటే ఎక్కువ మంది ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.