Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడ్రిడ్: స్పెయిన్లో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన బాటపట్టా రు.పెరుగుతున్న నిత్యావసరాల ధరల సూచీకి అనుగుణంగా తమకు మెరుగైన పెన్షన్లు అందించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు మాడ్రిడ్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వినియోగదారుల ధరల సూచీకి అనుగుణంగా ఏటా సవరిస్తూ తమకు కనీసం 1,080 యూరోల నెలసరి పెన్షన్ను అందించాలని వారు డిమాండ్ చేశారు. మాడ్రిడ్ నగరంతో పాటు దేశంలోని అనేక నగరాలు, పట్టణాలలో రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు ఇదే తరహాలో ప్రదర్శనలు నిర్వహించారు. స్టేట్ కో-ఆర్డినేటర్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ది పబ్లిక్ పెన్షన్ సిస్టమ్ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు జరిగాయి. 'పాలకులెవరైనా పెన్షన్లను కాపాడాలి' అంటూ వారు నినదించారు. ఈ ప్రదర్శనలకు వివిధ కార్మిక సంఘాలు సంఘీభావాన్ని ప్రకటించాయి. కోఆర్డినేటర్ సంస్థ ప్రతినిధి లియో పోల్డో మాడ్రిడ్లో జరిగిన ప్రదర్శననుద్దేశించి ప్రసంగిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు,కార్మికుల సమస్యల పరిష్కారంలో రాజకీయ పార్టీలు నిర్లిప్తత వహిస్తున్నాయని విమర్శించారు.