Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రన్ పెరిగిన ఇంధన ధరలపై రాయితీలు ప్రకటించారు. ఈ రాయితీలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇంధన ధరలపై పెంచిన పన్నులు తగ్గించాలంటూ 'ఎల్లోవెస్ట్' పేరిట ఫ్రాన్స్లో గతనెల 17 నుంచి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆందోళనకారుల సంఖ్య తగ్గిపోయింది. అంతేగాకుండా, స్టాస్బర్గ్లోని క్రిస్మస్ మార్కెట్లో తీవ్రవాదుల కాల్పుల ఘటనతో ఇండ్లలోనే ఉండాల్సిందిగా ప్రభుత్వ చేసిన అభ్యర్థనతో ఆందో ళనకారుల సంఖ్య తగ్గింది. గతవారం ఆందోళనకారులతో పోలిస్తే, దాదాపు సగం మంది మాత్రమే ఈసారి నిరసన తెలిపారు. శనివారం జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో దాదాపు 66వేలమంది పాల్గొన్నట్టు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.