Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని పెషావర్ ఆర్మీ స్కూల్ పున: ప్రారంభమైంది. 2014, డిసెంబర్16న ఈ పాఠశాలలోకి చొరబడ్డ ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. 134 మంది చిన్నారు లు సహా 148 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తు న్నట్టు తెహ్రీక్-ఇ-తాలిబన్ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. సైనిక పాఠశాల ల్లో చదువుతున్న చిన్నారులే తమ లక్ష్యమని పేర్కొంది. ఈనేపథ్యంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి స్కూల్ మూతపడింది. తాజాగా, పెషావర్ సైనిక పాఠశాల పున: ప్రారంభమైనట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.