Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలిఫోర్నియా: అరుణగ్రహంపైకీ వెళ్లే పర్యాటకుల సంఖ్య భవిష్యత్లో పెరిగే అవకాశముంది. ఈమేరకు పలు సంస్థలు స్పేస్ టూరిజమ్పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. వీటిలో ఎలోన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఒకటి. ఇప్పటికే పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఈ సంస్థ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతరిక్షం తర్వాత టూరిస్టులను చంద్రుడి మీదికి, మార్స్ మీదికీ తీసుకెళ్లే ఆలోచనలో స్పేస్ ఎక్స్ ఉంది. అయితే ఈ సంస్థ మిషన్ ప్రారంభమైతే మార్స్పైకి వెళ్లి రావడానికి ఎంత ఖర్చవుతుంది? ఇదే ప్రశ్న ఓ ట్విటర్ చాట్లో ఆ సంస్థ చైర్మెన్ ఎలోన్ మస్క్కు ఎదురైంది. ఈ ఖర్చు ఎంత మందిని తీసుకెళ్తున్నాం అనే అంశంతోపాటు పునర్వినియోగంపై ఆధారపడి ఉంటుందని మస్క్ చెప్పారు. అయితే ఏదో ఒక రోజు మార్స్పైకి వెళ్లి రావడానికి 5 లక్షల డాలర్ల వరకు ఖర్చు కావొచ్చని అంచనా వేశారు. ఇంత తక్కువ ధర వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లోని చాలా మంది భూమి మీద నివాసాన్ని వదిలేసి అరుణ గ్రహంపైకి వెళ్లి ఉండే అవకాశం కలుగుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. మార్స్పైకి కూడా పర్యాటకులను తీసుకెళ్లాలని స్పేస్ ఎక్స్ భావిస్తున్నా.. దాని కంటే చంద్రుడి మీద నివాసం ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది.