Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేమ్ : ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో పోలండ్ రాజధాని వార్సాలో జరిగిన సదస్సుకు హాజరయ్యారు. భేటీ అనంతరం మీడియాతో నెతన్యాహూ మాట్లాడారు. మధ్య ప్రాఛ్య దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరై తమ ఐక్యతను మరోసారి చాటుకున్నారని అన్నారు. గత కొన్నేండ్లుగా మధ్య ప్రాఛ్య దేశాల ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇరాన్ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఇరాన్ ఓ అణ్వస్త్ర శక్తిదేశంగా ఎదగాలని భావిస్తున్నదని అన్నారు.
రానున్న రోజుల్లో ఇరాన్ ఓ శక్తిమంతమైన అణ్వస్రాలున్న దేశంగా అవతరించే ప్రమాదముందని అన్నారు. అణ్వస్త్ర పరీక్షలపై దృష్టి పెట్టినందున ఆదేశంతో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు. కాగా, మధ్య ప్రాఛ్య దేశాల్లో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా పనిచేస్తోందని మైక్ పోంపియో అన్నారు. మధ్య ప్రాఛ్యంలోని 11 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్న ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు మోపామని అన్నారు. అంతేగాకుండా, 2015లో ఇరాన్తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసుకున్నామని అన్నారు.