Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికాను ఓ కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు జొంబీ డీర్. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికన్లు తాజాగా జింకలను చూస్తేనే హడలెత్తిపోతున్నారు. వన్య ప్రాణులైన జింకలు, దుప్పులలో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో, అమెరికా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
'జొంబీ డీర్' వ్యాధికి క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ ( సీడబ్ల్యుడీ) అనేది వ్యావహారిక నామం. జింక, దుప్పి జాతుల్లో మాత్రమే ఇప్పటివరకూ దీని ఆనవాళ్లు కనిపించాయి. జింకల శారీరక ద్రవాలు, మలం, లాలాజలం, రక్తం లేదా మూత్రంలో ఉన్న సీడబ్యూడీ వైరస్ ఎక్కువకాలం పర్యావరణంలో ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని ఇలినాయిస్ సహా 24 రాష్ట్రాల్లో జొంబీ డీర్ వ్యాపించినట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. పైగా, సీడబ్ల్యుడీ వైరస్ సోకగానే.. దాని సింప్టమ్స్ కనిపించేందుకు కొంత కాలంపడుతుంది. శరీరం మొత్తాన్ని ఆవరించిన తర్వాత గానీ అది సోకినట్టు కనిపించదు. దీని తీవ్రత గురించి ఆందోళన పడాల్సి వస్తోందని వైద్యులు హెచ్చరి స్తున్నారు. జొంబీ వైరస్ సోకగానే బరువు తగ్గిపోవడం, బాగా దప్పిక వేయడం, నోట్లో నుంచి చొంగకారడం, చెవులు దిగజారడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.
ఇప్పటికే వేలకొద్దీ జింకల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయి. వాటి ఫ్లూయిడ్స్ అవశేషాలు క్రమంగా వాతావరణంలో కలిసి.. కొంతకాలం తర్వాత మనుషులకు సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాధి నివారణకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో అమెరికన్లలో ఆందోళన మొదలైంది. ఈ వ్యాధి నివారణ మార్గాలపై దృష్టి పెట్టింది.