Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసీలియా : బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వాను విడుదల చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎందుకు నినదిస్తున్నారో అర్ధం చేసుకోవాలని, తాను అమాయకుడిని కాబట్టే ప్రజలు తాను విడుదల కావాలని కోరుకుంటున్నారని లూలా పేర్కొన్నారు. జైల్లో వున్న లూలాను కలిసిన అనంతరం లూలా ఇనిస్టిట్యూట్కి చెందిన జర్నలిస్టు నికోల్ బ్రియాన్స్ మాట్లాడుతూ, లూలా అభిప్రాయాన్ని ఆయన మాటల్లోనే చెప్పారు. ప్రస్తుతం లూలా శిక్ష అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రం పరానా రాజధాని క్యూర్టిబా జైల్లో ఆయనను బ్రియాన్స్ కలిసి మాట్లాడారు. ప్రజలు ఇలా భావించడం తనకు మరింత బలాన్ని ఇస్తోందని లాలూ వ్యాఖ్యానించారు. తనను రాజకీయ ఖైదీగా నిర్భంధించడం వెనక గల కుట్రలు, కుతంత్రాలను ప్రపంచానికి బహిర్గతం చేయాల్సిందిగా ఆయన బ్రియాన్స్ను కోరారు. ఎప్పుడూ బ్రెజిల్ గురించే లూలా ఆలోచన అని ఆమె చెప్పారు. ఆయనతో తన సమావేశం చక్కగా ముగిసిందని, చాలా సమాచారం తెలిసిందని అన్నారు. లూలాను అక్రమంగా జైల్లో పెట్టారని,ఏళ్ళ తరబడి దర్యాప్తు, రెండుసార్లు జైలు శిక్ష విధించినా ఆయనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదని, అందుకే ప్రజలు కూడా ఆయన్ని అంతలా ఆరాధిస్తున్నారని బ్రియాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వ బందీగా వున్నారని ఆమె వ్యాఖ్యానించారు.