Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదుగురు మృతి, ఐదుగురు పోలీసులకు గాయాలు
అరోరా : ఇల్లినాయిస్లో ఒక కంపెనీ గోదాముపై సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు కార్మికులు మరణించారు. ఐదుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు. ఈ సంస్థ నుంచి తొలగించిన ఉద్యోగే ఈ కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. కాగా కాల్పులు జరిపిన ఆ సాయుధుడిపై పోలీసులు కూడా కాల్పులు జరిపారు. అరోరా పోలీసు చీఫ్ క్రిస్టిన్ జిమన్ మాట్లాడుతూ, దుండగుడిని గారీ మార్టిన్ (45)గా గుర్తించినట్లు చెప్పారు. హెన్రీ ప్రాట్ కంపెనీలో 15ఏండ్లపాటు పనిచేసిన మార్టిన్ను ఇటీవల విధుల నుంచి తొలగించడంతో ఆగ్రహంతో ఈ కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. చికాగోకి 65కిలోమీటర్ల దూరంలోని అరోరాలో ఈ కంపెనీ గోదాములో శుక్రవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. మార్టిన్ నివసించాడని భావిస్తున్న అపార్ట్మెంట్ను, ఆ కాంప్లెక్స్ను పోలీసు అధికారులు క్షుణ్ణంగా సోదా చేశారు. హ్యాండ్గన్ను కలిగివున్న మార్టిన్ కాల్పులు జరపడానికి ముందే ఆయుధాన్ని కొనుగోలు చేశాడా లేక అంతకుముందే అతని వద్ద వుందా అనే విషయం ఇంకా కచ్చితంగా తేలలేదు. మార్టిన్కు నేరచరిత్ర వుందా లేదా అని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు చీఫ్ తెలిపారు. మిసిసిపిలో దాడికి దిగిన కేసులో 1995లో మార్టిన్ దోషిగా తేలినట్టు ప్రభుత్వ రికార్డులు తెలుపుతున్నాయి.