Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విగ్రహంపై రంగుతో రాతలు
లండన్ : ప్రముఖ రాజకీయ తత్వవేత్త అయిన కార్ల్మార్క్స్ను దుండగులు మరోసారి అగౌరవపరిచారు. ఉత్తర లండన్లోని హైగేట్ స్మశానంలో ఉన్న ఆయన సమాధి ఉన్న విగ్రహంపై ఎరుపు పెయింట్ పూసి దుష్టానందం పొందారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను స్మశానం ప్రతినిధులు శనివారం ట్విట్టర్లో పోస్టు చేశారు. విగ్ర హంపై ఎరుపు రంగుతో పొలిటికల్ నినాదాలు రాసి ఉండడం ఆ ఫొటోల్లో స్పష్టంగా కనపడుతోంది. ఈ ఘటనపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామాజిక స్పృహ లేని వ్యక్తులు చేసిన పనిగా వారు తెలిపారు. ఇదే విధంగా ఈ నెలలోనే కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సుత్తితో దాడి చేశారు.