Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యం కాల్పుల్లో తాలిబన్ కమాండర్ సహా 17 మంది హతం
కాబూల్ : అఫ్ఘాన్ భద్రతా బలగాలు నిర్వ హించిన వైమానిక దాడుల్లో 17 మంది తాలిబన్లు హతమయ్యారు. మృతుల్లో తాలిబన్ సంస్థ కీలక కమాండర్ మౌలావీ ఎస్మత్ ఎస్మత్యార్ కూడా ఉన్నారు.
ఫర్యాబ్ ప్రావిన్స్లోని ఖైసర్ జిల్లాలో తాలిబన్ల కదలికలు ఉన్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అఫ్ఘాన్ బలగాలు ప్రత్యేక ఆపరే షన్ నిర్వహించాయి.
ఈ దాడుల్లో తాలిబన్ సంస్థ కీలక కమాండర్ సహా 17 మంది మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారని తాలిబన్స్ అధికార ప్రతినిధి హనీఫ్ రేజారు అన్నారు.
10 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో 10 మంది అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వీరి వద్ద నుంచి తుపాకులు, మారణాయుధాలు, మందు గుండు సామాగ్రి, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. నాన్గర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ నగరంలో వీరిని అదుపు లోకి తీసుకున్నట్టు ధ్రువీకరించారు. నాన్గర్హార్ ప్రావి న్స్లో ఉగ్రవాదుల కదలికలున్నట్టు అందిన విశ్వస నీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు, పోలీ సులు ఉమ్మడి ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ నిర్వహి స్తున్నాయని ప్రావిన్స్ గవర్నర్ షా మహ్మద్ మియాకిల్ తెలిపారు.