Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి, 23 మందికి గాయాలు
కాబూల్ : వరుస బాంబు పేలుళ్లతో అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం దేశ ప్రజలం తా పర్షియన్ నూతన సంవత్సర వేడుకల్లో నిమగమైన సమయంలో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలు ళ్లలో ఆరుగురు మృతి చెందగా, మరో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించుకోలేదు. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తాలిబన్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతినిధి వహీదుల్లా మయర్ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్లో పేలుళ్లు సంభవించడంతో ఆరుగురు మృతిచెందారు. మరో 23 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాబూల్ యూనివర్శిటీ, షియా కర్తే సాఖి ప్రార్థనా మందిరం దగ్గర్లోని మసీదు వాష్ రూమ్లో, ఆస్పత్రికి సమీపంలో,ఎలక్ట్రిసిటీ మీటర్ దగ్గర మొత్తం మూడు రిమోట్ కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజి వ్స్ తో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. యూనివర్శిటీ దగ్గర్లోని ఓ మైన్ ని అధికారులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఈఘటనపై అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సాను భూతి తెలిపారు. కాగా, గతేడాది షియా కర్తే సాఖి ప్రార్థనా మందిరం వద్ద జరిపిన పేలుళ్లలో 33మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. సున్నీ మెజారిటీ ఉన్న అఫ్ఘనిస్థాన్లో షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్ తరచూ దాడు లకు పాల్పడుతోంది. గతంలో అనేకసార్లు దాడులకు పాల్ప డిన ఐఎస్ గురువారం జరిగిన దాడులకు కూడా పాల్పడి ఉండవచ్చని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు.