Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి
బీజింగ్: సెంట్రల్ చైనాలో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. తన కారుతో వేగంగా వెళ్లి జనసమూహాన్ని ఢకొీట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. నిందితుడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు ఉన్మాదిని కాల్చి చంపారు. చైనాలోని హుబై ప్రావిన్స్ జోయాంగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఉన్మాది ఉద్దేశపూర్వకంగానే జనాలపైకి కారు దూసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడనేందుకు కారణం తెలియరాలేదు.
గతేడాది సెప్టెంబర్లో ఓ దుండగుడు ఇదే తరహాలో కిరాతకానికి ఒడిగట్టాడు. జనసమూహంపైకి కారుతో దూసుకెళ్లడంతో 11 మంది మృతి చెందారు.