Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మాండ్ :అంతరిక్షంలో తొలి ఉపగ్రహం ప్రయోగించినట్టు నేపాల్ వెల్లడించింది. భూకక్ష్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంలో నేపాలిశాట్-1 కీలక పాత్ర పోషిస్తుందని ఈ ప్రాజెక్టును చేపట్టిన ఆభాస్ మాస్కే, హరీరామ్ శ్రేష్టా అనే శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వర్జీనియా ఎయిర్ అండ్ స్పేస్ సెంటర్ ఆఫ్ నేషనల్ ఏయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బుధవారం గం.2-30నిమిషాలకు నేపాలిశాట్-1ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. జపాన్లోని క్యూషూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నేపాల్కు చెందిన శాస్త్రవేత్తలిద్దరూ ప్రయోగాలు జరిపారు. నేపాల్ ట్రోపోగ్రాఫికీ సంబంధించిన చిత్రాలను చిత్రీకరించేందుకు వీలుగా నేపాలిశాట్-1లో ఐదు కెమెరాలు, మ్యాగటో మీటర్లు అమర్చామని నేపాల్ అకాడమి ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధికార ప్రతినిధి సురేష్ కుమార్ దుంగల్ తెలిపారు. శాటిలైట్ చిత్రీకరించిన చిత్రాలను నాస్టాకు పంపనున్నట్టు ఆయన చెప్పారు. శాటిలైట్ ఏడాదిపాటు భూకక్ష్యలో ఉంటుందని అన్నారు. ఈప్రాజెక్టు కోసం నేపాల్ ప్రభుత్వం 2 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నేపాల్ పీక్యూ-1 శాటిలైట్ తయారు చేసి 2020లో అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు ఇంజినీర్ గ్రాడ్యు యేట్లు కృషి చేస్తున్నారని సురేష్ కుమార్ తెలిపారు. 'నేపాల్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైంది. నేపాలిశాట్-1 ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలకు హార్థిక శుభాకాంక్షలు' అని ప్రధాని కేపీ శర్మ ట్వీట్ చేశారు.