Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హింసాత్మక అల్లర్లను అరికట్టడంలో
- విఫలమైన మైగా
బమాకో : మాలీ ప్రధాని బౌబీయి మైగా తన పదవికి రాజీనామా చేశారు. ఒగాసోగౌలో చెలరేగిన హింసాత్మక అల్లర్లను అరికట్టలేకపోయినందున పదవి నుంచి తప్పుకున్నట్టు వెల్లడించారు. మైగా రాజీనామాను అధ్యక్షుడు ఇబ్రహీమ్ బౌబకర్ కీటా అంగీకరించారు. వివరాల్లోకి వెళ్లితే...గతనెల 23న ఒగాసోగౌ గ్రామంలో నరమేధం జరిగింది. డోగాన్ తెగకు చెందిన కొంతమంది వేటగాళ్లుగొర్రెల కాపర్లపై కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 160 మంది గొర్రెల కాపర్లు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం మాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన జరిగి దాదాపు నెలరోజులు అయినప్పటికీ ఈ దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో మైగా సర్కార్ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా, అంతర్జాతీయ హక్కుల సంఘాల నుంచి ప్రధానిపై విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా, మాలీ భద్రతా బలగాలపై అల్ఖైదా అనుబంధ సంస్థకు చెందిన మిలిటెంట్లు వరుస దాడులకు పాల్పడుతున్నప్పటికీ ప్రధాని సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. నూతన ప్రధానిని త్వరలో ఎన్నుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నట్టు ఇబ్రహీమ్ వెల్లడించారు.