Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాటికన్ సిటీ: కైస్తవులు పవిత్రంగా భావించే వాటికన్ సిటీలో పురాతన మైన మెట్ల మార్గాన్ని తెరిచారు. 300 ఏండ్ల తర్వాత తొలి సారి సందర్శకుల కోసం ఈ మెట్ల మార్గాన్ని తెరచి ఉంచారు. యేసు క్రీస్తు స్వయంగా ఈ మెట్ల ద్వారా వెళ్లారని క్రైస్తవుల నమ్మకం. పురాతనమైన ఈ మెట్లు చెక్కతో నిర్మితమై ఉండేవి. ఇటీవలే మెట్లను మొత్తం పాలరాయితో తుది మెరుగులు దిద్దారు. సందర్శకులు 28 పాలరాయి మెట్లపై మోకాలిపై వెళ్తూ ముద్దాడతారు. పాలరాయి మెట్లపై మూడు ప్రదేశాల్లో మధ్యయుగపు శిలువలు చెక్కబడి ఉంటాయి. మెట్ల ద్వారా లోనికి ప్రవేశించిన వారికి జీవితకాల అనుభవం కలుగుతుందని క్రైస్తవ మతపెద్దల అభిప్రాయం.