Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈనెలాఖరులోగా రష్యాలో పర్యటిస్తారని క్రెమ్లిన్ కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్, కిమ్ మధ్య కీలక భేటీ ఉంటుందని తెలిపింది. అయితే, ఇరుదేశాధినేతల సమావేశం ఎప్పుడు, ఏ నగరంలో నిర్వహిస్తారనే విషయాన్ని మాత్రం క్రెమ్లిన్ వెల్లడించలేదు. భద్రతా కారణాల దృష్ట్యా సమావేశ ప్రదేశాన్ని ప్రకటించలేమని పేర్కొంది.
కొరియా ద్వీప కల్పంపై శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలు, ద్వైపా క్షిక సంబంధాల బలోపేతంపై ఇరుదేశాధినేతలు చర్చించే అవకాశముందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డీమిత్రీ పెస్కోవ్ తెలిపారు. కాగా, కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన అంశం, ఉత్తరకొరియాపై ఆంక్షల తొలగింపు, అణ్వస్త్ర నిరాయుధీకరణ అంశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య రెండు సార్లు భేటీ జరిగింది. గతేడాది జూన్లో సింగపూర్లో జరిగిన చరిత్రాత్మక తొలిభేటీ, ఈఏడాది ఫిబ్రవరి28న వియత్నాం రాజధాని హనోరులో జరిగిన రెండోదఫా భేటీ విఫలమైనట్టు ఉత్తరకొరియా ప్రకటించింది.
రెండుసార్లు భేటీ జరిగినప్పటికీ ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలను కొనసాగిస్తున్నది. మరోపక్క మూడోసారి భేటీ నిర్వహిం చాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై రష్యాతో చర్చించేందుకు ఉత్తరకొరియా అధినేత సన్నద్ధమైనట్టు సమాచారం.