Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనరల్ ఖలీఫా సైన్యంపై గగనతల దాడులు
ట్రిపోలి : లిబియాను పాలించిన గడాఫీ 2011లో హత్యకు గురైనప్పటి నుంచి ఆ దేశం రాజకీయ అస్థిరత, హింసత్మాక దాడులతో ఛిన్నాభిన్నమవుతున్నది. ప్రస్తుతం ఐరాస గుర్తింపున్న ప్రభుత్వానికి, జనరల్ హఫ్తార్ ఖలీఫాకు చెందిన లిబియన్ నేషనల్ ఆర్మీ(ఎల్ఎన్ఏ)కి మధ్య పెద్దఎత్తున హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ రెండు బలగాలకు మధ్య కొన్ని రోజుల క్రితం నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటికి 220 మంది ప్రజలు మృతి చెందారు. ప్రస్తుతం లిబియా రాజధాని నగరం ట్రిపోలిని ఆక్రమించుకునేందుకు జనరల్ హఫ్తార్ ఖలీఫా నేతృత్వంలోని బలగాలు ఈ నెల ప్రారంభం నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కాగా, ఐరాస గుర్తింపున్న ప్రధాని ఫయజ్ అల్ సెర్రా నేతృత్వంలోని ప్రభుత్వం ఆ బలగాలను తిప్పికొట్టే చర్యలు మొదలుపెట్టింది. ఎల్ఎన్ఏపై ఏడు గగనతల దాడులు జరిపినట్టు సెర్రా ప్రభుత్వం తెలిపింది. ఎల్ఎన్ఏ వేగంగా ఆక్రమణ చర్యలు చేపడుతున్నదని, ఇప్పటికే ట్రిపోలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నదని వివరించింది. వీరిని అడ్డుకునేందుకు కౌంటర్ అఫెన్సెవ్ చర్యలు మొదలుపెట్టినట్టు తెలిపింది.