Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిలియన్ డాలర్ల నష్టం
వాషింగ్టన్: టేకాఫ్ సమయంలో ఓ పక్షి దాడి వల్ల యూఎస్ ఎఫ్-35 స్టెల్త్ బాంబర్ మిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈ ఘటన జపాన్ ఎయిర్బేస్లో చోటుచేసుకుంటుంది. ఈనెల7న ఎఫ్-35బీ యుద్ధ విమానం మెరైన్ ఎయిర్క్రాఫ్ట్ గ్రూప్-12 నుంచి టేకాఫ్ తీసుకోగా ఓ పక్షి దాన్ని ఢీ కొట్టింది. అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశాడు. ఈ ఘటనలో పైలెట్కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనిపై నష్టం అంచనా నివేదిక కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంది. కాగా మెరైన్ కార్ప్స్ మాత్రం జరిగిన నష్టాన్ని క్యాటగిరి-ఏ లో చేర్చింది. అంటే నష్టం దాదాపు 2 మిలియన్ల డాలర్లు దాటి పోనున్నట్టు సమాచారం. 1990లో ఎఫ్-35 యుద్ధ విమానాల తయారీకి అమెరికా రక్షణ విభాగం రూపకల్పన చేసింది. రానున్న దశాబ్దాలలో మొత్తం 2,500 యుద్ధ విమానాలను తయారు చేయను న్నట్టు ప్రకటించింది. మొత్తం వ్యయం 400 బిలయన్ల డాలర్లు. ఒక్కో విమానం ఖరీదు 115 మిలియన్ డాలర్లు. పెంటగాన్ చరిత్రలోనే అత్యంత వ్యయంతో అభివృద్ధి చేసిన ఆయుధ సంపత్తిగా ఇది నిలిచింది. మెరైన్ కార్ప్స్ బలోపేతానికి ఇవి ఎంతగానో దోహద పడనున్నాయి. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అతి తక్కువ సమయం లోనే టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యం ఎఫ్-35బీ యుద్ధ విమానాల సొంతం.