Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్ఘాన్ రాజధాని కాబూల్లో ఘటన
కాబూల్ : నాటో దళాలు నిర్వహించిన వైమానిక దాడిలో 17 మంది పోలీసులు మృతి చెందారు. తాలిబన్ల స్థావరంపై వైమానిక దాడి జరిపేందుకు ప్రయత్నించిన నాటో దళాల రాకెట్ లాంఛర్ పొరపాటున కాబూల్ పోలీస్హెడ్క్వార్టర్స్కు సమీపంలో పడింది. దీంతో, 17 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై నాటో దళాలు క్షమాపణలు చెప్పాయి. హెల్మాండ్ ప్రావిన్స్లోని లష్కర్ ఝా ప్రాంతంలో ఈ వైమానిక దాడి జరిగిందని ప్రావిన్షియల్ కౌన్సిల్ చీఫ్ అతావుల్లా అఫ్ఘాన్ తెలిపారు. కాగా, అఫ్ఘాన్లో తాలిబన్ల స్థావరాల లక్ష్యంగా భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ప్రత్యేక ఆపరేషన్కు అమెరికా సంకీర్ణదళాలు సహకరిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అఫ్ఘాన్ సైన్యం, యూఎస్ సంకీర్ణదళాలు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. తాలిబన్ల ఏరివేత కోసం ప్రయత్నిస్తున్నాయి.