Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆఫ్రికా దేశాల నుంచి బానిసలను తీసుకొచ్చేందుకు అమెరికా ఉపయోగించినట్టు ఆధారాలు
వాషింగ్టన్ : అలబామా రాష్ట్రంలో ఓ పురాతన నౌక శిథిలాలు లభ్యమయ్యాయి. 1860లో ఆఫ్రికా దేశాల నుంచి బానిసలను తరలించేందుకు అమెరికా ఈ నౌకను ఉపయోగించినట్టు అలబామా నావికాదళం పేర్కొంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన చిన్నారులతో, మహిళలతో, పురుషులతో అమెరికా కఠినమైన పనులు చేయించుకునేది. బానిసలను తీసుకొచ్చేందుకు అమెరికా ఉపయోగించిన నౌకల్లో ఇదే చివరిదని అలబామా అనుమానిస్తోంది. అలబామా రాష్ట్రలోని మొబైల్ నది అంతర్భాగంలో స్మగ్లింగ్ కోసం అమెరికా ఉపయోగించిన క్లొటిల్డా నౌక శకలాలు లభ్యమయ్యాయని అలబామా హిస్టారికల్ కమిషన్ వెల్లడించింది. ఈ నౌక శకలాల ద్వారా అమెరికా చీకటి కోణాలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చే అవకాశముందని అన్నారు. కాగా, ఆఫ్రికా దేశాల నుంచి అమెరికా బానిసలను తీసుకొచ్చి వెట్టిచాకిరి చేయిస్తుండేది. అమెరికా వైఖరిపై అనేక దేశాలు మండిపడ్డాయి. హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆఫ్రికన్ల హక్కులను అమెరికా కాలరాస్తోందని విమర్శించాయి. దీంతో, బానిసల రవాణాను నిలిపివేసినట్టు 1808లో అమెరికా ప్రకటించింది. అయితే, గుట్టుచప్పుడు లేకుండా 1860వరకు ఆఫ్రికా దేశాల నుంచి బానిసలను తీసుకొచ్చినట్టు తాజా నౌక శకలాల ద్వారా స్పష్టమవుతున్నది. క్లొటిల్డా నౌక...బెనిన్ నగరం నుంచి అలబామాకు 110 మందితో ప్రయాణించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.