Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు భారతీయ పర్వతారోహకుల మృతి
ఖాట్మండ్ : నేపాల్లోని ఎవరెస్ట్ శిఖరంపై ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్తో ముగ్గురు భారతీయ పర్వతారో హకులు మృతి చెందారు. వీరి మృతి తో ఈ వారం మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. స్థానిక అధికా రులు తెలిపిన వివరాల ప్రకా రం..భారత్కు చెందిన నిహాల్ భగవాన్ అనే పర్వతారోహకుడు గురు వారం ఉదయం 8గంటలకు ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నాడు. తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో బాగా నీరస పడిపోయాడు. దీన్ని గమనించిన సహచర పర్వతారోహకులు అతన్ని లోవర్ క్యాంప్ వద్దకు తీసుకువచ్చారు. కొద్దిసేపటికే అతను మృతిచెంది నట్టు వైద్యులు ధ్రువీక రించారు. కల్పనాదాస్(53), అంజలీ కులకర్ణి (53) అనే ఇద్దరు మహి ళలు ఎవరెస్ట్ శిఖరం నుంచి తిరగు ప్రయాణం అవుతున్న క్రమంలో మృతి చెందారు. కాగా, ఈనెల ఆరంభంలో అమెరికా, ఐర్లాండ్, భారత్కు చెందిన పర్వతారోహకులు మృతిచెందారు.