Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 మంది మృతి, 8 మంది గల్లంతు
బీజింగ్: చైనాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చైనా నైరుతి భాగంలోని గిజౌ ప్రావిన్స్లోని బీపన్ నదిలో ఓ పడవ బోల్తా పడడంతో 10 మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఇప్పటివరకు తాము 11 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. ఆ పడవలో మొత్తం 29 మంది ప్రయాణం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక సహాయక బృందాలు గల్లంతైన వారి ఆచూకీ కోసం నదిలో గాలిస్తున్నాయి. పడవల యజమాని సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.