Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెరూసలేమ్ : ఇజ్రాయిల్లో కొద్ది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాడ్పులు వీస్తున్నాయి. ఈనేపథ్యంలో పలు ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేపనిలో నిమగమైంది.
జెరూసలేమ్, టెల్అవీవ్ శివారు ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. ఈ ప్రాంతాలకు దగ్గరలో నివిసిస్తున్న 3,500 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. ఇజ్రాయిల్ మెట్రోలాజికల్ సర్వీస్ వెల్లడించిన వివరాల ప్రకారం...గురువారం సముద్ర మట్టం నుంచి 754 మీటర్ల ఎత్తులో ఉన్న జెరూసలేమ్లో 37.5 డిగ్రీల సెల్సియస్, టెల్అవీవ్లో 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కార్చిచ్చు చెలరేగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు.