Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెరూ: ఉత్తర-మధ్య పెరూలో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ భూగర్భ పరిశోధన సంస్థ తెలిపింది. రిక్టర్స్కేల్పై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్టు వివరించింది. ఈ రోజు తెల్లవారు జామున 2.41కి గంటలకు భూకంపం సంభివించినట్టు అధికా రులు తెలిపారు. ఆగేయ ల్యాగునా స్కు 80 కిలోమీటర్ల దూరంలో, యురీమ్యాగ్వాస్ నగరానికి 158 కిలోమీటర్ల దూరంలో 114 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
దీనిపై పెరూ ప్రభుత్వం కూడా ట్విటర్లో స్పందించింది. రిక్టర్ స్కేలుపై మొదట 7.2 తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని, లిమా, కల్లావూ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ ప్రమాదం ఏమీ లేదని అధికారులు వివరించారు. రెండు, మూడు నిమిషాలపాటు భూ ప్రకంపనలు రావడంతో తాము ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశామని అక్కడి ప్రజలు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.