Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యూహాత్మక భాగస్వామ్య విషయాలపై చర్చలు
- స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లూంగ్, టోని
సింగపూర్ : ప్రధాని మోడీ నవంబర్లో అధికారిక సింగపూర్ పర్యటన చేస్తారు. దీనిలో ద్వైపాక్షిక అంశాలు, పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాలను కూలంకషంగా చర్చిస్తామని సింగపూర్ ప్రధాని లీ హేన్ లూంగ్ శనివారం తెలిపారు. ఇరువురి మధ్య జరిగే చర్చలు ఫలిస్తాయని లూంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ బృందానికి సింగపూర్ స్వాగతం పలుకుతుందన్నారు. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య విషయాల్లో చర్చలు అవసరమన్నారు. భారతీయలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. 1947లో బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి బయటపడిన భారత్ ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. భారత్కు మంచి నాయకత్వం లభించిందన్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్నాయని తెలిపారు. సింగపూర్ స్వాతంత్య్రాన్ని తొలుత గుర్తించిన దేశాల్లో భారత్ ఒకటని ఆయన చెప్పారు. కాగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకు సింగపూర్ అధ్యక్షుడు టోని టన్ కెంగ్ యామ్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. సింగపూర్ ప్రజల తరుపున భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. చరిత్రలోనూ భారత్, సింగపూర్కు సత్సంబంధాలు ఉన్నాయన్నారు.