Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగాండను కోరిన ప్రపంచ బ్యాంక్
కంపాలా : విద్యారంగంపై దృష్టి పెట్టాలని ప్రపంచ బ్యాంక్ ఉగాండను కోరింది. విద్యారంగం కోసం బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని సూచించింది. 2025నాటికి నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు ఉగాండకు 2బిలియన్ డాలర్ల ( రూ.13,949 కోట్లు) నిధులు అవసరముంటుందని అభిప్రాయపడింది. ఇటీవలి కాలంలో పాఠశాలలో డ్రాపవుట్ శాతం బాగా పెరిగిపోయిందని, చిన్నారులు బడిబాట మాని కూలీలుగా అవతారమెత్తడం శోచనీయమని తెలిపింది. విద్యాభివృద్ధి కోసం ఉగాంఢ కేవలం 2.6శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. విద్యాభివృద్ధి కోసం ఇకపై అధిక మొత్తంలో ఖర్చు చేయాలని కోరింది.