Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురు అమెరికా సైనికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమెరికా సైన్యం కాన్వారు లక్ష్యంగా పేలుడు జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలినబ్లు ప్రకటించుకున్నారు. అఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నస్రత్ రహీమీ తెలిపిన వివరాల ప్రకారం....అమెరికా నేతృత్వంలోని నాటో మిషన్ అఫ్ఘాన్ సైన్యంతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తున్నది. అఫ్ఘాన్లో ఆధిపత్యం కోసం ఓ పక్క తాలిబన్లు మరోపక్క ఐఎస్ పోరాడుతున్నది. ఈనేపథ్యంలో తాలిబన్ల స్థావరాలపై అమెరికా సంకీర్ణదళాలు, అఫ్ఘాన్ బలగాలు దాడులకు పాల్పడుతున్నాయి. శుక్రవారం అమెరికా ఆర్మీ కాన్వారుపై దాడికి పాల్పడ్డారు. ఈదాడిలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురు అమెరికా సైనికులు గాయపడ్డారు. ఇదిలా ఉండగా, పవిత రంజాన్ మాసం ముగిసేంత వరకు కాల్పుల విరమణ పాటించాల్సిందిగా తాలిబన్లను అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కోరారు. అయితే, అధ్యక్షుడి విజ్ఞాపనను పెడచెవినపెట్టిన తాలిబన్లు రక్తపాతాన్ని కొనసాగిస్తూ అఫ్ఘాన్లో అశాంతియుత వాతావరణం సృష్టిస్తున్నారు.