Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెయిన్లో ఘటన
మాడ్రిడ్ : తన కుమారుడికి వచ్చిన లెటర్ను చదవడంతో పాటు, దాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించిన ఓ తండ్రికి స్పెయిన్ కోర్టు రెండేండ్ల జైలుశిక్షను విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సెవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి పదేండ్ల కుమారుడు ఉన్నాడు. అతనికి తల్లి తరఫు బంధువుల నుంచి ఓ లేఖ వచ్చింది. అతని తండ్రి దాన్ని తెరిచి చదివాడు. బాలుడికి రాసిన లేఖలో తండ్రిపై ఉన్న గృహహింస కేసుకు సంబంధించిన వివరాలను ఆమె ఆరా తీసింది. అతను చేసిన తప్పులు ఎత్తిచూపుతూ విమర్శించింది. దీన్ని చూసిన అతను, కోర్టుకు వెళ్లి భార్య తరఫు బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని, కావాలనే కేసులు పెట్టారని, దానికి సాక్ష్యమే ఈ లేఖని వాదించాడు. ఆసలు వేరే వారికి వచ్చిన లేఖను ఎందుకు చదవాల్సి వచ్చిందన్న న్యాయమూర్తి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. బాలుడి గోప్యతకు తండ్రే భంగం కలిగించారని భార్య తరఫు లాయర్లు చేసిన వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, అతనికి రెండేండ్ల జైలు శిక్షను, జరిమానాను విధిస్తున్నట్టు ప్రకటించింది.