Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు గల్లంతు
ట్రిపోలి: లిబియాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాద వశాత్తు పడవ మునిగి ఏడుగురు గల్లంతయ్యారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఇద్దరి మృతదేహాల్ని వెలికితీశారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... గర్రాబుల్లీ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో 80 మంది వలసదారులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో అది ప్రమాదవశాత్తూ నీటిలో మునిగింది. ఈ ఘటనలో లిబియన్ కోస్ట్ గార్డ్స్ 73 మందిని రక్షించారు. పడవలో ఉన్న వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. ఇందులో ఇద్దరి మృతదేహాలను లిబియన్ కోస్ట్ గార్డులు వెలికితీశారు. వెలికితీసిన మృతదేహాల్లో ఒకరు మహిళ, మరొకరు చిన్నారిగా గుర్తించారు. పడవలో వలస వెళ్తున్న వారిలో 40 మంది పురుషులు 25 మంది స్త్రీలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వలసదారులంతా కెన్యా, సుడాన్, ఐవరీ తీర ప్రాంతాలకు చెందినవారని చెబుతున్నారు. వేలాదిమంది వలసదారులు రబ్బరు బోట్లలో సముద్రంలో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో లిబియాలో పడవ ప్రమాదం జరిగింది. వలసదారులతో ప్రయాణిస్తున్న రెండు పడవలు మునిగాయి. ఈ ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. లిబియాలోని గారాబుల్లి రేవు నుంచి ప్రయాణం ప్రారంభించిన పది గంటల్లో మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు.