Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాకస్ : వెనిజులా రాజధాని కరాకస్ నగరంలోని తమ దౌత్య కార్యాలయాన్ని తాత్కా లికంగా మూసివేసినట్టు కెనడా ప్రకటించింది. వెనిజులాతో తలెత్తిన విభేదాల కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. విదేశాల్లోని దౌత్య కార్యాలయాల విధులను క్రమక్రమంగా తగ్గించాలని అధ్యక్షుడు నికోలస్ మదురో యోచిస్తు న్నారని తెలిపింది. అందుకే, ఆదేశంలోని దౌత్య కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశామని పేర్కొంది. కాగా, వెనిజులా ప్రతిపక్ష నేత గైడో తనకు తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. మదురోను గద్దె దింపేందుకు కుట్ర పన్ని సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం చేశాడు. అయితే, దేశ ప్రజలతో పాటు సైన్యం కూడా మదురోకే మద్దతుగా నిలిచింది. గైడో చర్యలను అమెరికా సహా 50దేశాలు మద్దతి స్తున్నాయి. మదురోను ఎలాగైనా అధ్యక్ష పీఠం నుంచి వైదొలిగేలా చేసి గైడోను కూర్చోబెట్టాలని వ్యూహ రచన చేస్తున్నాయి. అయితే, గైడోకు మద్దతిస్తున్న దేశాల జాబితాలో కెనడా కూడా ఉంది. అందుకే, ఆదేశంలోని ఎంబసీని మూసివేయాలని మదురో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా దౌత్యవేత్తల వీసాల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని కెనడా విదేశాంగ మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తెలిపారు.