Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెర్రిటరీ (ఎస్టి)లో మంగళవారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని స్థానిక పోలీసులు వెల్లడించారు. పోలీస్ కమిషనర్ రీస్ కెర్షా మీడియాతో మాట్లాడుతూ ఎన్టి రాజధాని డార్విన్ నగరంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించారని, మరికొంత మంది గాయపడ్డారని వివరించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఒక మోటెల్ నుండి భారీ కాల్పులు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ దాడి ఉగ్రదాడి అని తాము భావించటం లేదని, ఈ కాల్పులో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే పాల్గొన్నాడని వివరించారు. ఈ నిందితుడు గత జనవరిలో పెరోల్పై జైలు నుండి విడుదలయ్యాడని ఆయన చెప్పారు.