Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: గూగుల్ సీఈఓ సుందర్ పిచారుకి అమెరికా భారత వాణిజ్య మండలి (యూఎస్ఐబీసీ) ప్రతి ఏటా ఇచ్చే గ్లోబల్ లీడర్షిప్ అవార్డును ప్రకటించింది. 2019కిగాను సుందర్ పిచారుతో పాటు నాస్డాక్ అధ్యక్షురాలు అడేనా ఫ్రైడ్మాన్ను ఎంపిక చేశారు. ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి రెండు కంపెనీలు అందిస్తున్న సేవలకు గాను వారిని ఎంపిక చేసినట్టు మండలి పేర్కొంది. వచ్చేవారం జరగబోయే ఇండియా ఇండియాస్ సదస్సులో వారికి అవార్డును ప్రధానం చేయనున్నారు. గూగుల్, నాస్డాక్ కంపెనీల సహకారంతో 2018లో అమెరికా-భారత్ మధ్య వస్తుసేవల ద్వైపాక్షిక వాణిజ్యంలో 150 శాతం మేర వృద్ది చెందినట్టు యూఎన్ఐబీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా నాస్డాక్ అధ్యక్షరాలు ఫ్రైడ్మాన్ స్పందిస్తూ.. యూఎస్ఐబీసీ కృషితో ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు సాంస్కృతిక బంధం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. పిచారు మాట్లాడుతూ..గూగుల్ అభివృద్ధికి భారత్ ఎంతగానో తోడ్పాటునందిస్తుందని అన్నారు.