Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓల్డెన్బర్గ్ (జర్మనీ): రోగులకు రక్షణ కల్పించాల్సిన నర్స్ ఒకరు వారినే బలితీసుకున్న ఘటన ఇది. 2000-2005 మధ్య కాలంలో తన రక్షణలో ఉన్న కొందరు రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి వారి మరణానికి కారణమైన జర్మన్ పురుష నర్స్కు యావజ్జీవిత జైలు శిక్ష విధిస్తూ ఇక్కడి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. నీల్స్ హోగెల్ అనే ఈ 42 ఏండ్ల సీరియల్ హంతకుడికి శిక్ష విధించిన న్యాయమూర్తి సెబాష్టియన్ బ్యూర్మన్ ఈ హత్యలు 'అత్యంత అమానుషమ'ని అభివర్ణించారు. 2005లో ఒక హత్య చేస్తూ రెడ్హాండెడ్గా పట్టుబడేంత వరకూ కొనసాగించిన వరుస హత్యల్లో 85 మంది పేషెంట్లను ఇతడు బలితీసుకున్నాడు. మరో అరు హత్యలకు పాల్పడిన కేసులో ఇప్పటికే ఓ దశాబ్ద కాలం జైలులో గడిపిన హోగెల్కు ఇప్పుడు యావజ్జీవిత జైలు శిక్ష పడటం విశేషం. హోగెల్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 200లకు పైగానే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.హోగెల్ చేతుల్లో మరణించిన వారి సంఖ్యను విని దిగ్భ్రాంతికి గురైన మేజిస్ట్రేట్ బ్యూర్మన్ ఇది మానవ ఊహలకు అందనిదని వ్యాఖ్యానించారు. ఈ వరుస హత్యల కేసులో 2005లో అరెస్టయిన హోగెల్కు అప్పట్లో ఏడేండ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. అయితే బాధిత కుటుంబాల వత్తిడి మేరకు 2014-15లో మరోసారి విచారణ జరిపిన కోర్టు అతడికి యావజ్జీవిత జైలుశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.