Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిఆర్ఐ ప్రాజెక్టుపై జర్మన్ ఐటి సంస్థ మెస్సె మన్చెన్
మ్యూనిచ్: చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు ద్వారా ఐరోపా, చైనా సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకార విస్తరణకు అవకాశాలు పెరిగాయని జర్మనీకి చెందిన ఐటి, సప్లరు మేనేజ్మెంట్ సంస్థ మెస్సెమన్చెన్ అధినేత స్టెఫాన్ రమ్మెల్ చెప్పారు. 'ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్ 2019' పేరుతో ఇక్కడ భారీ వాణిజ్య ప్రదర్శన నిర్వహిస్తున్న ఈ సంస్థ అధినేత గురువారం ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాజిస్టిక్స్ ఇండిస్టీకి చెందిన వివిధ అంశాలపై ప్రతిరోజూ ఇక్కడ పానెల్ చర్చలుంటున్నాయని, ఇందులో ఒకటి కచ్చితంగా బీఆర్ఐ ప్రాజెక్టు సంబంధించి కూడా ఉంటుందని చెప్పారు. ఐరోపా, చైనా మధ్య అనేక అంతర్ నిర్మిత లాజిస్టిక్ నెట్వర్క్స్ పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. వ్యూహాత్మకమైన బిఆర్ఐ ప్రాజెక్టు న్యూ సిల్క్రోడ్ ప్రాజెక్టు అమలవుతున్న దాదాపు అన్ని దేశాలలో కొనసాగుతోందని ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలకు వున్న అవకాశాలపై ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న ప్రధాన మార్కెటింగ్ సంస్థలు చర్చిస్తున్నాయని, దీనితో పాటు నిపుణులైన వర్కర్ల కొరత, కృత్రిమ మేథో ప్రయోగం, స్మార్ట్సిటీ లాజిస్టిక్స్ మార్గాలు, రైలు, రోడ్డు, జల, వాయు మార్గాలలో కొనసాగుతున్న లాజిస్టిక్ ట్రెండ్స్పై చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. లాజిస్టిక్స్ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో బ్రెగ్జిట్, అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు వంటి అంశాలతో ఐరోపా ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో కొనసాగుతోందన్నారు. ఈ సమయంలో లాజిస్టిక్స్ ఇండిస్టీ మరింత జాగ్రత్తగా వుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా-చైనా మధ్య ఏం జరుగుతుందన్న విషయంపై వారు వేచి చూస్తున్నారని ఆయన చెప్పారు.