Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26 మందికి గాయాలు
రియాద్ : సౌదీ అరేబియాలోని ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణిని ప్రయోగించారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ సంకీర్ణదళాల కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటుదారులు బుధవారం క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. వీరిలో విదేశీ ప్రయాణీకులే అధికంగా ఉన్నారు. తిరుగుబాటుదారులు క్షిపణి దాడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టు సౌదీ అనుమానిస్తున్నది. అంతేగాకుండా, తిరుగుబాటుదారులకు ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు దిగుమతి అవుతున్నాయని తెలిపింది. ఆభా ఎయిర్పోర్టుపై తిరుగుబాటుదారులు మూడు క్షిపణులు ప్రయోగించారని, వీటిలో రెండింటిని గాల్లోనే పేల్చేశామని కమాండర్ తెలిపారు. యెమెన్, సనా నగరాల్లో హౌతీ తిరుగుబాటుదారుల ప్రాభల్యం అధికంగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉనికి కోసం తిరుగుబాటుదారులు పాకులాడుతున్నారు. జన సమ్మర్థ ప్రదేశాలను, పాఠశాలలను, ఆస్పత్రులను, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు.