Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికాకు చైనా మొబైల్ దిగ్గజం హువావే కౌంటర్..
బీజింగ్ : అమెరికా బెదిరింపులకు, ఆంక్షలకు ధీటుగా సమాధానం చెప్పిన చైనా మొబైల్ తయారీ దిగ్గజ సంస్థ హువావే కీలక విషయాన్ని ప్రకటించింది. తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను ( ఓఎస్) తొందరలోనే లాంచ్ చేయనున్నామని ప్రకటించింది. మమ్మల్ని తక్కువగా అంచని వేయొద్దని ప్రకటించిన హువావే ఆండ్రాయిడ్కు ప్రత్యామ్నాయంగా 'హాంగ్మెంగ్' పేరుతో కొత్త ఓఎస్ను లాంచ్ చేయనుంది. తద్వారా అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఆపిల్కు పెద్ద షాక్ ఇస్తోంది.
హువావే 'హాంగ్మెంగ్' ఓఎస్ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే తన ఫోన్లలో ఆండ్రాయిడ్ స్థానంలో గ్లోబల్గా దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని హువావే తెలిపింది. ఈ మేరకు హువావే టెక్నాలజీస్ కో లిమిటెడ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ విలియమ్సన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హాంగ్మెంగ్ ఆపరేటింగ్ సిస్టంను ఇప్పటికే చైనాలో మిలియన్కు పైగా స్మార్ట్ఫోన్లలో అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ట్రేడ్మార్క్ను సాధిస్తామని అన్నారు. గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హువావేను బ్లాక్లిస్ట్లో పెట్టి, సంస్థ వ్యాపార లావాదేవీలను నిషేధించారు. శత్రు దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్వర్క్కు ప్రమాదం పొంచి ఉందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. చైనాకు చెందిన ప్రపంచపు అతిపెద్ద టెలికం కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ కంపెనీ హువావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, హువావేకు అమెరికాలో కార్యకాలాపాల కొనసాగింపు కోస మంటూ అమెరికా వాణిజ్య శాఖ 90 రోజుల తాత్కాలిక లైసెన్స్ జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే గూగుల్ హువావేతో సంబంధాలు తెంచుకుం టున్నట్టు ప్రకటించింది. ఇటీవల ఫేస్బుక్ కూడా ఇదే బాటలో పయనించింది.
ప్రస్తుతం అమెరికా కంపెనీలైన గూగుల్, ఆపిల్ కు చెందిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. హువావే 2012 నుంచే సొంత ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తోందని ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి. తాజా ప్రకటనతో అమెరికా ప్రభుత్వంతో పాటు గూగుల్, ఆపిల్ కంపెనీలకు ఝలక్ ఇచ్చినట్టేనని టెక్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఓఎస్ తుది పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఈ ఏడాది అక్టోబర్ కల్లా అన్ని హువావే ఉత్పత్తులకు 'హాంగ్ మెంగ్ ఓఎస్' ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత తమ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ సేవలు లభించవని స్పష్టం చేసింది. దాదాపు 22.50 కోట్ల మొబైల్ ఫోన్లలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ను ఇన్స్టాల్ చేయనున్నారు. మరోవైపు వివో, ఒప్పో కంపెనీలు ఈ ఓఎస్ను పరీక్షించేందుకు తమ బృందాలను పంపినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ హాంగ్ మెంట్ ఓఎస్ ట్రేడ్ మార్కు కోసం హువావే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలతో పాటు ఐరోపాలో దరఖాస్తు చేసింది.