Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 మంది మృతి, 71 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 15 మంది మృతి చెందగా, 71 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. రైల్వే అధి కారులు వెల్లడించిన వివరాల ప్రకారం... రహీమ్ యార్ఖాన్ పట్టణంలోని వాల్హర్ రైల్వేస్టేషన్లో పట్టాలపై నిలిపిఉంచిన గూడ్స్రైలును అక్బర్ ఎక్స్ ప్రెస్ ఢకొీంది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 71 మంది గాయపడ్డారు. బహవల్పూర్ నుంచి క్వెట్టాకు బయల్దేరిన అక్బర్ ఎక్స్ప్రెస్కు ఇచ్చే సిగల్లో పొరపాటు జరగడంతో అది గూడ్స్ రైలు నిలిపిఉంచిన లూప్ లైన్లోకి ప్రవేశించింది. దీంతో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. సమాచారం అందు కున్న ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీయడానికి హైడ్రలిక్ కట్టర్ల సహాయంతో తొలగిస్తున్నారు. మరి కొన్ని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృ తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే గాయ పడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు. ఈ రైలు ప్రమాద ఘటనలను నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని పాక్ రైల్వే మంత్రికి సూచించారు. కాగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పాక్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంతాపం తెలిపారు. అనంతరం మృ తుల కుటుంబాలకు రూ.15 లక్షలు, గాయపడినవారికి రూ.5లక్షల నష్ట పరి హారాన్ని ప్రకటించారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని అన్నారు.