Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అక్రమ వలస వాసులను ఆదివారం నుంచి అరెస్టు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపధ్యంలో వలస వాసుల కుటుంబాలను బహిష్కరించే చర్యలను చేపట్టనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి మాథ్యూ అల్బెన్స్ తెలిపారు. ప్రధానంగా ఇటీవల అత్యధిక సంఖ్యలో సరిహద్దుకు చేరుకున్న సెంట్రల్ అమెరికన్లకు సంబంధించి ఇమ్మిగ్రేషన్ కోర్టులలో ఉన్న కేసులను ''వేగవంతంగా విచారించాల్సిన జాబితా''లో జాబితాలో చేర్చినట్లు ఆయన తెలిపారు. 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోనూ, 2017లో ట్రంప్ హయాంలోనూ ఇటువంటి కార్య కలాపాలే జరిగాయి. ఇటువంటి కార్యకలాపాలు చేపట్టడం కొత్తేమి కాదని అల్బెన్స్ అన్నారు. ఈ ఆపరేషన్ ముగిసిన తరువాత కూడా ఈ కేసులు పరిశీలనా యోగ్యంగా ఉన్నట్లయితే వాటిపై దర్యాప్తు చేస్తామని అల్బెన్స్ తెలిపారు. చికాగో, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, మియామితో సహా 10 ప్రధాన కోర్టులలో తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న వలస వాసులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.