Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్ : ఫ్రాన్స్ రాజధాని పారిస్లో రైలు ప్రమాదం జరిగింది. లెవల్ క్రాసింగ్ దాటేందుకు ప్రయత్నించిన కారును రైలు ఢకొీంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మేయర్ ఫిలిప్ మాసిర్ తెలిపిన వివరాల ప్రకారం....చిన్నారుల సంరక్షణ కేంద్రం నిర్వాహకురాలు ముగ్గురు పిల్లలను తనతో పాటు కారులో తీసుకెళ్లింది. సిగల్ను గమనించకుండా అవినరు వాల్డీఓర్ వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ను దాడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో కారును రైలు ఢకొీన్నది. ఈప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రైలులోని నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.