Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాలెట్టా : మాల్టా జర్నలిస్ట్ డాఫిన్ కరువానా గలీజియా హత్య కేసులో ముగ్గురు నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 2017లో మాల్టా జర్నలిస్ట్ డాఫిన్ హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అవినీతి నిర్మూలనపై ఆమె రాజీలేని పోరాటం చేశారు. అవినీతికి పాల్పడే అధికారుల గురించి పరిశోధనాత్మక వ్యాసాల్లో వివరించేవారు. కొందరు గుర్తుతెలియని దుండగులు ఆమెను హతమార్చారు. అదే ఏడాది బ్రదర్స్ ఆల్ఫ్రెడ్, జార్జ్ డెగిర్గియో, విన్స్మస్కట్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈముగ్గురు నిందితులే డాఫిన్ను హత్య చేశారని నిర్ధారించేందుకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. మాల్టా రాజధాని వాలెట్టాలో 2017, అక్టోబర్16న ఆమె ప్రయాణిస్తున్న కారు మార్గంలో బాంబులు అమర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. డాఫిన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులను విచారించాలని ప్రధాని జోసఫ్ మస్కట్ నుంచి ఆదేశాలు అందినట్టు ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.