Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనీలా : ఫిలిప్పీన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్లోని సెబూ ప్రావిన్స్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై విద్యా శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించింది. డ్రైవర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు.