Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 వారాల నుంచి కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ నగరంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ అల్లర్లలో పదుల సంఖ్యలో నిరసనకారులు గాయపడ్డారు. సెంట్రల్ హాంగ్కాంగ్లో నిరసన ప్రదర్శనలు చేపట్టకూడదని ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఆదివారం రాత్రి నిరసనకారులు పెద్ద ఎత్తున నిషేధిత ప్రాంతానికి చేరుకొని నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం నిరసనకారులు చేపట్టిన ప్రదర్శనల్లో నాలుగు లక్షల మందికిపైగా పాల్గొన్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, హాంగ్కాంగ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుల విచారణ చైనాలో చేపట్టాలని ఇక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈప్రతిపాదనను ప్రజల్లోకి తీసుకెళ్లగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి నిర్ణయాలతో దేశ సార్వభౌమత్వం దెబ్బతినే ప్రమాదముందని ప్రజలు వ్యతిరేకించారు. దీంతో, ప్రభుత్వం తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ప్రతిపాదనను రద్దు చేయాలనే డిమాండ్తో ప్రజలు గత ఏడు వారాల నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అల్లర్లలో అనేక మంది గాయపడ్డారు. అయితే, మెజారిటీ పౌరులు మాత్రం హాంగ్కాంగ్లో అడ్డుఅదుపు లేకుండా పెట్రేగిపోతున్న నేరాలను కట్టడి చేయాలంటే నిందితులను చైనాకు అప్పగించడమే సరైన నిర్ణయమంటూ సమర్థిస్తున్నారు.