Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబూ ధాబి యువరాజు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చైనాలో సోమవారం పర్యటించారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు చైనా మంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సైనిక వందన స్వీకరించిన అల్ నహ్యాన్ గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం అంశంపై ఇరుదేశాధినేతలు చర్చించనున్నట్టు చైనా స్టేట్ మీడియా పేర్కొంది.