Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణకొరియా ఆర్మీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం..ఉత్తర కొరియా తూర్పు తీరంలో వోన్సన్ నగర సమీపం నుంచి బుధవారం తెల్లవారు జామున వీటిని ప్రయోగించినట్టు తెలిపింది. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం వారం రోజుల్లో ఇది రెండోసారి. ఉత్తర, దక్షిణ కొరియాలను విభజించే డీమిలిటరైజ్డ్ జోన్లో జూన్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశం తర్వాత గతవారం ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం జరిపింది. ఆగస్టులో అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టదలచిన దక్షిణ కొరియాకు ఇదో గట్టి హెచ్చరిక అని అప్పుడు వ్యాఖ్యానించింది. బుధవారం నాటి క్షిపణి ప్రయోగం వోన్సన్ నౌకాశ్రయానికి సమీపంలోని కల్మా ప్రాంతం నుంచి జరిగింది. 20 నిమిషాల వ్యవధిలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించింది. క్షిపణులు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. గరిష్ఠంగా 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి.