Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించనున్నట్టు అమెరికా వెల్లడించింది. అఫ్ఘాన్లో శాంతి స్థాపన లక్ష్యంతో తాలిబన్ నేతలకు, అఫ్ఘాన్ ప్రతినిధులకు మధ్య దోహా నగరంలో చర్చలు కొనసాగుతున్నాయి. 18 ఏండ్ల నుంచి అఫ్ఘాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం. అయితే, ఈచర్చలకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తున్నది. అఫ్ఘాన్ నుంచి అమెరికా సంకీర్ణదళాలు వెనక్కి వెళ్లిపోయినట్టయితేనే కాల్పుల విరమణ, శాంతి స్థాపన అంశాలపై చర్చకు హాజరవుతామని తాలిబన్ నేతలు మెలిక పెట్టారు. దీంతో, అఫ్ఘాన్లో మోహరించిన 14వేల మంది సైనికులను ఉపసంహరించుకోనున్నట్టు అమెరికా రక్షణ శాఖ శుక్రవారం వెల్లడించింది.