Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరల్ కోర్టు చెక్
న్యూయార్క్ : అమెరికాలో ఆశ్రయం పొందాలనుకుంటున్న వలస వాసుల సంఖ్యను తగ్గించేందుకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రాన్డాల్ఫ్ మాస్ 'చెక్' పెట్టారు. సరిహద్దులను అక్రమంగా దాటి వచ్చిన వలస వాసులకు ఆశ్రయాన్ని తిరస్కరించే హక్కు ప్రభుత్వానికి లేదని రూలింగ్ ఇచ్చారు. చట్టబద్ధమైన మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించిన ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిరాకరించే విధానంపై ఇప్పటికే మరో జడ్జి తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పెట్టిన నిబంధన వలసవాసుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కూడా న్యాయమూర్తి రాన్డాల్ప్ శుక్రవారం ఇచ్చిన రూలింగ్లో పేర్కొన్నారు. అమెరికాకు చట్టబద్ధంగాను, చట్ట విరుద్ధంగాను వస్తున్న వలసలను తగ్గించే లక్ష్యంతో 2018 నవంబరులో ట్రంప్ వరుస విధానాలను తీసుకు వచ్చారు.
అందులో భాగంగానే దరఖాస్తులను తిరస్కరించే నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ విధానాన్ని ప్రకటించడం ద్వారానే 2016లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2020 నాటి ఎన్నికల ప్రచారంలో కూడా ఇప్పటికే ఇది భాగమైంది. ట్రంప్ తీసుకొ చ్చిన ఈ నిబంధన పలు చట్టబద్ధమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నది. వాషింగ్టన్ కేసులో ఆశ్రయం కోరుతున్న 19 మంది నికరాగువా హోండురస్, ఎల్సాల్వెడార్, గుటెమాలకు చెందినవారు. వీరంతా పలు కారణాలు పేర్కొంటూ నిబంధనను కోర్టులో సవాల్ చేశారు. ప్రత్యేకించి ఆ నిబంధన అమెరికా చట్టాన్ని ఉల్లంఘించిందని వారు పేర్కొన్నారు. చటబద్ధంగా ప్రవేశించారా, చట్ట విరుద్ధంగా ప్రవేశించారా?అనే దానితో నిమిత్తం లేకుండా ఆశ్రయం కోరుతూ వలసవాసులు చేసుకున్న దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించాల్సి ఉంటుందని అమెరికా చట్టంలో స్పష్టంగా ఉంది.