Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 మంది మృతి
మనీలా : ఫిలిప్పీన్స్లో మూడు పడవలు మునిగి పోయాయి. ఈ ఘటనలో 25 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. నావికాదళ అధికారి ఫ్రాంకో అగూడో తెలిపిన వివరాల ప్రకారం.... ఫిలిప్పీన్స్ నుంచి బయల్దేరిన మూడు పడవలు తీరం దాటిన కొద్ది గంటల అనంతరం నీట మునిగాయి. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి 14 మంది ప్రయాణీకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. గల్లంతైన మరో ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నావికులు పడవ ల్లో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో తరుచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.