Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లో ఓ కానిస్టేబుల్ ఉన్మాదిగా మారిపోయాడు. తన సహచరులపై కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సహచర కానిస్టేబుల్స్ మృతిచెందారు. కాల్పులకు పాల్పడ్డ అనంతరం ఘటనాస్థలం నుంచి పరారైన నిందితుని కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్టు కాందహార్ ప్రావిన్స్ అధికార ప్రతినిధి జమాల్ నసీర్ తెలిపారు. ఇదిలా ఉండగా, కాల్పులకు పాల్పడ్డ నిందితుడు తమ సంస్థలో చేరినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి ఖారీ యూసఫ్ అహ్మదీ సంచలన ప్రకటన చేశారు. దీంతో, అఫ్ఘాన్ సర్కార్ అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. తాలిబన్ల ప్రకటనపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు అఫ్ఘాన్లో చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.