Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాణిజ్య సంబంధాలకు బ్రేక్
ఇస్లామాబాద్: కాశ్మీర్ విషయంలో భారత చర్యలను నిరసిస్తూ పాకిస్థాన్ తన ఆక్రోశాన్ని వెల్లగక్కింది. ఆ దేశంలోని భారత రాయబారి అజరు బిసారియాను బహిష్కరించింది. పాక్ హై కమిషనర్ మొయిన్ ఉల్ హక్ను భారత్కు పంపిచొద్దని నిర్ణయించుకుందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ తెలిపారు. వచ్చే నెలలోనే పాక్ హైకమిషనర్ భారత్లో బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అంతేగాక భారత్తో వాణిజ్య సంబంధాలను తాత్కాలికంగా రద్దు చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకోనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ బుధవారం వెల్లడించారు. గతంలో కుదుర్చుకున్న ద్వైపాక్షిక సంబంధాలను పున: సమీక్షించుకోనున్నట్టు తెలిపారు. ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ భద్రత, భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై చర్చించారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై విస్తృతంగా చర్చించినట్టు ఇమ్రాన్ తెలిపారు. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఐరాస, భద్రతా మండలి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఈనెల14న కాశ్మీరీలకు మద్దతుగా సంఘీభావం ప్రకటించాలని కూడా నిర్ణయించినట్టు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.